ఆదోని: తాగునీటి సమస్యపై సిపిఎం ముడు రోజులు పాదయాత్ర

70చూసినవారు
ఆదోని: తాగునీటి సమస్యపై సిపిఎం ముడు రోజులు పాదయాత్ర
త్రాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మే 11 నుంచి 13 వరకు ఆదోని మండలంలోని 22 గ్రామాల్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్రలు నిర్వహించనున్నారు. శుక్రవారం సిపిఎం మండల కార్యదర్శి కే. లింగన్న మాట్లాడుతూ పెద్దతుంబలం నుంచి ప్రారంభమయ్యే యాత్రలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. మే 14న ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్