కర్నూలు స్థాయీ సంఘం ఎన్నికలకు సర్వం సిద్ధం

59చూసినవారు
కర్నూలు స్థాయీ సంఘం ఎన్నికలకు సర్వం సిద్ధం
కర్నూలు కార్పొరేషన్ స్థాయీ సంఘం ఎన్నికలకు సర్వం సిద్ధం చేశామని కేఎంసీ కమిషనర్ రామలింగేశ్వర్ బుధవారం తెలిపారు. గురువారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుందన్నారు. పోలీసు శాఖతో సమన్వయం చేసుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేశామన్నారు.

సంబంధిత పోస్ట్