కర్నూలు విద్యాశాఖాధికారి శామ్యూల్ పాల్ను ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి ఆదివారం కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న పాఠశాలల నిర్మాణాలు, అవసరమైన వసతుల గురించి డీఈవో దృష్టికి తీసుకెళ్లారు. అలాగే, ఆలూరు కేజీబీవీలో సీట్లను 20% పెంచాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ వినతలపై డీఈవో సానుకూలంగా స్పందించినట్లు ఆయన ప్రకటించారు.