దోమల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కర్నూలు నగరపాలక కమిషనర్ భార్గవ్ తేజ ఆదేశించారు. నగరంలో డ్రైడే ఫ్రైడే కార్యక్రమంపై సంబంధిత విభాగ సిబ్బందితో శుక్రవారం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ప్రజలకు వ్యక్తి గత, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబల కుండా చూడాలని ఆదేశించారు.