8న పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు

61చూసినవారు
8న పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు
కర్నూలు జిల్లాలో ఈ నెల 8న పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని డీఈవో శామ్యూల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన ప్రకటన విడుదలైందని. ప్రతి విద్యార్థి తల్లి, తండ్రి, సంరక్షకుడి వివరాలు ఓటరు జాబితాలో పొందుపరచనున్నట్లు చెప్పారు. ఈ జాబితాలో అభ్యంతరాలుంటే 5వ తేదీ సాయంత్రంలోగా మార్పులు చేసుకోవాలని, ఛైర్మన్, వైస్ చైర్మన్, సభ్యుల ఎన్నిక ఉంటుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్