కర్నూలు: నగరంలో పారిశుద్ధ్యం లోపిస్తే చర్యలు తప్పవు

62చూసినవారు
కర్నూలు: నగరంలో పారిశుద్ధ్యం లోపిస్తే చర్యలు తప్పవు
కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్యం లోపిస్తే శానిటరీ ఇనస్పెక్టర్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని నగరపాలక కమిషనర్ ఎస్. రవీంద్రబాబు స్పష్టం చేశారు. శుక్రవారం కమిషనర్ బళ్లారి చౌరస్తా, నరసింహారెడ్డి నగర్, రోజా స్ట్రీట్, పాత ఈద్గా, సంపత్ నగర్, గాంధీనగర్ ప్రాంతాలను తనిఖీ చేశారు. పారిశుద్ధ్యం, పూడిక తీత తదితర వాటిని పరిశీలించారు. ప్రతిరెండు వారాలకు ఒకసారి తప్పనిసరిగా పూడికతీత పనులు చేపట్టాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్