కర్నూలు: ప్రైవేట్ హాస్పిటల్స్, డయాగ్నస్టిక్ సెంటర్లపై ఆగ్రహం

61చూసినవారు
కర్నూలు జిల్లాలో ప్రైవేట్ హాస్పిటల్స్, డయాగ్నస్టిక్ సెంటర్లు నిబంధనలు ఉల్లంఘిస్తూ ప్రజలపై భారం మోపుతున్నాయని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం కర్నూలు డివైఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో మాట్లాడారు. అనుమతులు లేకుండా, ధరల పట్టికలు లేకుండా నడుస్తున్న వాటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో డీఎంహెచ్వో కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్