కర్నూలు కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా బుధవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇటీవల జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో చర్చించిన అంశాలు, వాటిపై ప్రభుత్వం సూచించిన చర్యల అమలు గురించి సమీక్షించడమే ఈ సమావేశ ఉద్దేశం. జిల్లాలో అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి సంబంధించిన వివిధ కార్యక్రమాల పురోగతిపై అధికారుల నుండి నివేదికలు స్వీకరించి, సమర్థవంతమైన అమలు దిశగా సూచనలు అందించారు.