కర్నూలు నగరపాలక కమిషనర్ యస్. రవీంద్రబాబు శుక్రవారం పాత బస్టాండ్, కల్లూరు పరిధిలోని పలు కాలనీల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఆయన స్థానిక అధికారులకు సమగ్ర పరిశుభ్రతపై సూచనలు ఇచ్చారు. అనంతరం పరిమళనగర్లోని అన్న క్యాంటీన్ను సందర్శించి అక్కడి నిర్వహణ, భోజన నాణ్యతపై సమీక్షించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అధికారులకు ఆదేశించారు.