కర్నూలు జిల్లాలో ఆర్థికంగా వెనుకబడిన బీసీలు, కాపు లబ్ధిదారులకు స్వయం ఉపాధి పథకం కింద రూ.11.77 కోట్ల చెక్కును శుక్రవారం జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా, ఎంపీ నాగరాజు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పంపిణీ చేశారు. 508 మందికి లాభం చేకూరేలా కలెక్టర్ రంజిత్ బాషా, ఎంపీ నాగరాజు, ఎమ్మెల్యే చరితారెడ్డి చెక్కులు అందజేశారు. ప్రభుత్వం కార్పొరేషన్ల ద్వారా సంక్షేమానికి కట్టుబడి ఉందని అధికారులు తెలిపారు.