ఏప్రిల్ 19న నిర్వహించనున్న స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతంగా జరపాలని కర్నూలు జాయింట్ కలెక్టర్ డా. బి. నవ్య అధికారులకు ఆదేశించారు. గురువారం కర్నూలులో స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర, వాట్సాప్ గవర్ననెన్స్ అంశాలపై టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి, మాట్లాడారు. ఈనెల 3వ వారంలో "వేస్ట్ కలెక్షన్" థీమ్తో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టారు.