కర్నూలు: ఆస్పత్రి అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి

84చూసినవారు
కర్నూలు: ఆస్పత్రి అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి
కర్నూలు సర్వజన ఆస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్యంతో పాటు, సౌకర్యాలు కూడా కల్పించాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. మంత్రి టీజీ భరత్, జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, ఎంపీ బస్తిపాటి నాగరాజు, పాణ్యం, కోడుమూరు ఎమ్మెల్యేలు గౌరు చరిత, బొగ్గుల దస్తగిరి, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్