కర్నూలు నగరంలోని స్థానిక మౌర్య ఇన్ హోటల్ లో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి. నవ్య, మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం ఈ సందర్భంగా ఆమె కేంద్ర మంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి సన్మానించారు. రెండు రోజుల కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చినట్లు జేసీ డాక్టర్ నవ్య తెలిపారు.