కర్నూలు నగరం గుండా వెళ్లే 2. 3 కి. మీ. పొడవున్న నంబర్ 340-సీ రోడ్ను 100 అడుగుల వెడల్పుతో అభివృద్ధి చేయనున్నట్లు నగర కమిషనర్ రవీంద్రబాబు తెలిపారు. శుక్రవారం కర్నూలులో ఆయన సంబంధించిన భూ యజమానులతో మాట్లాడారు. ఇప్పటివరకు 90 మంది డాక్యుమెంట్లు సమర్పించారని, మిగిలిన భూమి యజమానులు వెంటనే డాక్యుమెంట్లు అప్పగించి అభివృద్ధికి సహకరించాలని సూచించారు. అనుమానాలను సమర్థవంతంగా పరిష్కరించనున్నట్టు తెలిపారు.