కర్నూలు: పూడికతీత పనులు పకడ్బందీగా చేపట్టాలి

73చూసినవారు
కర్నూలు: పూడికతీత పనులు పకడ్బందీగా చేపట్టాలి
కర్నూలు నగరంలోని 52 వార్డుల్లో చేపట్టిన పూడికతీత పనులను పకడ్బందీగా నిర్వహించాలని నగరపాలక కమిషనర్ యస్. రవీంద్ర బాబు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన పెద్దపడఖాన, దండెగేరి, తదితర ప్రాంతాల్లో పూడికతీత పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో మెరుగైన పారిశుద్ధ్యాన్ని అందించేందుకు చర్యలు చేపట్టామని, అందులో భాగంగా రూ. 1. 06 కోట్లతో పూడికతీత పనులకు శ్రీకారం చుట్టామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్