కర్నూలు నగరంలో బంధువుల వివాహ వేడుకలకు మంగళగిరి దంపతులు 12వ తేదీన హాజరయ్యారు. 13వ తేదీ తిరిగి మంగళగిరికి చేరుకున్నప్పుడు, వారి బ్యాగులోని రూ. 22 లక్షల విలువ చేసే 35 తులాల బంగారు ఆభరణాలు కనిపించలేదు. దీంతో వారు 14వ తేదీ రోజున కర్నూలు చేరుకుని టూ టౌన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీఫుటేజీ పరిశీలన చేయగా, చోరీ జరిగినది కనిపించలేదు. పోలీసులు మార్గమధ్యలో చోరీ జరిగిందని భావించి, కేసు నమోదు చేశారు.