కార్మికులను బానిసలుగా మార్చే విధంగా రూపొందించిన కార్మిక కోడ్లను వెంటనే రద్దు చేయాలని, అసంఘటిత రంగ కార్మికుల కోసం ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలని శనివారం సీఐటీయూ కర్నూలు నగర అధ్యక్ష కార్యదర్శులు అబ్దుల్ దేశాయ్, విజయ రామాంజనేయులు డిమాండ్ చేశారు. ఓల్డ్ సిటీ సీఐటీయూ కమిటీ ఆధ్వర్యంలో కర్నూలులో మాట్లాడారు. ఈనెల 20న దేశవ్యాప్తంగా జరగనున్న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు.