కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు బుధవారం విజయవాడ సచివాలయంలో రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, మత్స్యశాఖల మంత్రి అచ్చెన్నాయుడు, మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ, గనులు భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్రలను మర్యాదపూర్వకంగా కలిశారు. కర్నూలు జిల్లాలోని అభివృద్ధికి సహకరించాలని, జిల్లా అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చిస్తూ, అవసరమైన సహకారం అందించాలని మంత్రులను కోరారు.