అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. గురువారం కర్నూలులో వారు మాట్లాడుతూ మాఘాని నగర్లోని వైద్య కళాశాల భవనంపై విమానం కూలి 242 మంది ప్రయాణికులు, పలువురు వైద్య విద్యార్థులు మృతి చెందినట్లు ఆయన విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.