ఎమ్ఎస్ఎమ్ఈ సర్వేను వేగవంతం చేసి వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నాటికి పూర్తి చేయాలని కర్నూలు జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా ఎంపీడీవోలను ఆదేశించారు. శుక్రవారం కర్నూలు కలెక్టరేట్ నుండి ఎమ్ఎస్ఎమ్ఈ సర్వే, హౌసింగ్, ఉపాధిహామీ, పిజిఆర్ఎస్, రీసర్వే అంశాలపై స్పెషల్ ఆఫీసర్లు, డివిజన్, మండలస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రభుత్వం ఈ అంశానికి ప్రాధాన్యత ఇస్తోందని, సర్వేను వేగవంతం చేయాలన్నారు.