ఆంధ్రప్రదేశ్ అనస్థీషియా ఎంప్లాయిస్ టెక్నీషియన్స్ నూతన కార్యవర్గం ఎన్నుకున్నారు. రాష్ట్ర కార్యదర్శిగా కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి నుంచి ఎస్. దినేష్, ట్రెజరర్గా నంద్యాల ఆసుపత్రి నుండి ఆర్. వినోద్ కుమార్, ఈసీ మెంబర్గా అమర్ యాదవ్ ఎన్నికయ్యారని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి త్వరలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో అనస్థీషియా టెక్నీషియన్ల పోస్టులను మంజూరు చేయించేలా పనిచేస్తామన్నారు.