కర్నూలు నగరంలోని సీ. క్యాంప్ రైతు బజార్లో శనివారం స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు హాజరయ్యారు. ధనలక్ష్మి నగర్లో రూ. 50 లక్షలతో జై రాజ్ ఇస్పాత్ సంస్థ నిర్మించే పార్క్ పైలాన్ను సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు టీజీ భరత్, నారాయణ, ఎంపీలు బస్తిపాటి నాగరాజు, బైరెడ్డి శబరి ఆవిష్కరించారు.