కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ వైయస్సార్సీపీ వక్ఫ్ బిల్లును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిందని బుధవారం కర్నూలు మాజీ ఎమ్మెల్యే, హఫీజ్ ఖాన్ అన్నారు. ముస్లిం హక్కులకు భంగం కలిగించే ఈ చట్టానికి టీడీపీ, బీజేపీ చెప్పినట్టే మద్దతు ఇచ్చిందని విమర్శించారు. వక్ఫ్ చట్టం రాజ్యాంగ విరుద్ధమని, ముస్లింల హక్కులు కాపాడటమే వైసీపీ లక్ష్యమన్నారు.