కర్నూలు పోలీసు కార్యాలయంలో గురువారం మొబైల్ రికవరీ మేళాలో రూ. 1. 30 కోట్ల విలువైన 604 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేశారు. అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా ఆధ్వర్యంలో బాధితులకు రికవరీ చేసిన సెల్ ఫోన్ లను అందజేశారు. http: //Kurnoolpolice. in/mobiletheft ద్వారా ఫోన్ వివరాలు నమోదు చేస్తే ఉచితంగా రికవరీ చేస్తామన్నారు. ఒక్కరోజే 54 ఫోన్లు రికవరీ చేసిన హెడ్ కానిస్టేబుల్ శేఖర్ బాబుకు ప్రశంసా పత్రం అందజేశారు.