ఐదేళ్ల విద్యుత్ ప్రణాళికలో భాగంగా ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీకి చోటు లభించింది. 2024 అక్టోబరు 21న జరిగిన ఏపీ ఈఆర్సీ సమావేశంలో తీసుకున్న నిర్ణయంతో ఐసీఈపై విస్తృతస్థాయి చర్చ, అవసరమైన మార్పులు, చేర్పులతో రాష్ట్ర సమన్వయ కమిటీ అమోదం తెలిపింది. శనివారం కర్నూలులో ఇన్చార్జ్ చైర్మన్ ఠాకూర్ రామ్సింగ్ అధ్యక్షతన ఏపీ ట్రాన్స్కో 5వ విద్యుత్ రాష్ట్ర సమన్వయ కమిటీ సమావేశం జరిగింది.