కర్నూలు కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో ఈనెల 6న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండలాలు, మున్సిపల్ కార్యాలయాలు, డివిజన్ స్థాయిల్లో కార్యక్రమం జరుగుతుందని, ప్రజలు తమ సమస్యల వినతులను అందజేయడానికి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.