స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కర్నూలు జోహారాపురం ఇందిరమ్మ కాలనీలో సీపీఎం పార్టీ నగర కమిటీ సభ్యులు మహమూద్ డిమాండ్ చేశారు. శనివారం ప్రజల్లో అవగాహన కల్పిస్తూ గృహాల వద్ద పోస్టర్లు అతికించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అదానీ లాంటి కార్పొరేట్లకు లాభాలు చేకూర్చేలా పని చేస్తున్నాయన్నారు. స్మార్ట్ మీటర్ల ఒప్పందం అవినీతి పూరితమని ఆరోపిస్తూ తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.