సాంకేతిక పరిజ్ఞానంతోనే నేటి నేరాలకు అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుందని కర్నూలు జిల్లా అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా పేర్కొన్నారు. శుక్రవారం వ్యాస్ ఆడిటోరియంలో ఫోరెన్సిక్ ఎవిడెన్స్ మేనేజ్మెంట్పై పోలీసులకు శిక్షణా నిర్వహించారు. నేరాలు ఆధునిక పద్ధతుల్లో జరుగుతున్న నేపథ్యంలో, సాంకేతికత సహకారంతో ఆధారాలను సేకరించడం, విచారణలో వేగం పెంచడంపై చర్చించారు. ఇందులో డీఎస్పీలు, వైద్యులు, స్టేషన్ రైటర్లు పాల్గొన్నారు.