కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ జపాన్ పర్యటన ముగించి గురువారం తిరిగి విధుల్లో చేరారు. ఈనెల 5 నుంచి 14వ తేదీ వరకు ఆయన దంపతులు జపాన్ పర్యటనలో పాల్గొన్నారు. నంద్యాల ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా ఇన్చార్జి ఎస్పీగా బాధ్యతలు నిర్వహించారు. ఈనెల 17న ముఖ్యమంత్రి జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఎస్పీ విక్రాంత్ పాటిల్ విధుల్లో చేరి, పర్యటన ప్రాంతాల్లో భద్రత చర్యలపై సమీక్ష నిర్వహించారు.