డిసెంబర్ ఒకటి నుండి నెల్లూరు జిల్లా కావలిలో జరిగే రాష్ట్రస్థాయి అండర్ 12 రగ్బీ పోటీలకు జిల్లా జట్లు సమాయత్తం కావాలని రాష్ట్ర రగ్బీ సంఘం కార్యదర్శి బొల్లవరం రామాంజనేయులు కోరారు. శుక్రవారం కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో ఆయన మాట్లాడుతూ 13 జిల్లాల నుండి పాల్గొనే రాష్ట్రస్థాయి పోటీలను కావలిలో ఆర్గనైజింగ్ సెక్రటరీ మురళి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు. విజేతలకు మెడల్స్, ట్రోఫీతో పాటు ప్రశంస పత్రాలను అందజేస్తారని తెలిపారు.