నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని రౌడీ షీటర్లకు కర్నూలు జిల్లాలో కౌన్సిలింగ్ చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఆదివారం ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలతో నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసు అధికారులు అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలలో కౌన్సిలింగ్ నిర్వహించారు. సత్ప్రవర్తనతో జీవించాలని, నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు.