కర్నూలు జిల్లాలోని విద్యార్థులకు ప్రగతి కార్డులు 21వ తేదీలోపు అందించాల్సిందిగా అధికారులను జేసీ బి. నవ్య ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో వెబెక్స్ ద్వారా మాట్లాడుతూ జిల్లాలోని విద్యార్థులకు మార్కులతో కూడిన ప్రగతి కార్డులను 21 నాటికి అందించి ఆన్లైన్లో నమోదు పూర్తి చేయాలన్నారు. పై తరగతులకు చేర్చే ప్రక్రియ పూర్తిచేసి సోమవారం నాడు కొత్త తరగతుల్లో కూర్చునే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు.