పాకిస్తాన్తో జరిగిన కాల్పుల్లో వీరమరణం పొందిన ఏపీకి చెందిన జవాన్ మురళి నాయక్కు కర్నూలు కలెక్టరేట్ ఎదుట శనివారం ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. సీపీఐ నగర కార్యదర్శి పి. రామకృష్ణారెడ్డి, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు డి. సోమన్న తదితరులు పాల్గొన్నారు. జవాన్ త్యాగాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు.