కర్నూలు- బెంగళూరు జాతీయ రహదారిపై రింగ్ రోడ్డు సమీపంలో చెన్నై-సూరత్ హైవేపై కూలిన టన్నెల్ పరిసరాలను శుక్రవారం సిపిఎం బృందం పరిశీలించారు. కార్మికులు లేకపోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని తెలిపారు. 45 మీటర్ల లోతులో కూలిన సొరంగం, ప్రజలకు భయాందోళన కలిగించిందని అన్నారు. కాంట్రాక్టర్, అధికారులపై చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాధాకృష్ణ, ఆనంద్ బాబు డిమాండ్ చేశారు.