కర్నూలు నగరంలో చెక్పోస్టులోని పాల కేంద్రాలలో విజిలెన్స్ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు సీఐ పవన్ కిషోర్, యుగంధర్బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ తనిఖీల్లో ఓ షాపులో కల్తీ పాల విక్రయాలు గుర్తించారు. ప్రముఖ పాల కంపెనీల ప్యాకెట్లలో సాధారణ నెయ్యి కలిపి, కల్తీ నెయ్యి విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. ఎల్వీరెడ్డి డెయిరీ ఫామ్లో ప్యాకెట్లపై తయారీ ఎక్స్పైరీ తేదీలు లేవని అధికారులు గుర్తించారు.