కర్నూలు: వక్ఫ్ బిల్లుతో ముస్లింల హక్కులకు ముప్పు: హఫీజ్ ఖాన్

80చూసినవారు
కేంద్రం ప్రవేశ పెట్టిన వక్ఫ్ బిల్లును సుప్రీం కోర్టులోనే తేల్చుకుంటామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు, కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ప్రకటించారు. గురువారం ఆయన మాట్లాడుతూ. ఈ బిల్లుకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పిటిషన్లు వేశామని తెలిపారు. దేశవ్యాప్తంగా ముస్లిం సమాజం ఈ బిల్లును వ్యతిరేకిస్తుండగా, ఏపీలోని కడప, నెల్లూరు, కర్నూలు తదితర జిల్లాల్లో భారీగా ఆందోళనలు జరుగుతున్నాయన్నారు.

సంబంధిత పోస్ట్