కర్నూలు నగరంలోని సి. క్యాంపు రైతు బజార్ను ఉత్తమ రైతు బజార్గా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. శనివారం స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా సీఎం రైతు బజార్ను సందర్శించి, పారిశుద్ధ్య కార్మికులు, రైతులతో మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయ కేంద్రం, బయో డైజెస్టర్ యంత్రం, టాయిలెట్లు పరిశీలించారు. పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.