కర్నూలు వీకర్ సెక్షన్ కాలనీలో సుభాషిణి (22) ఇష్టంలేని పెళ్లి జరుగుతున్నందుకు మనస్తాపం చెంది గురువారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు వారం క్రితం నిశ్చితార్థం జరిగింది. అమీలియో హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తున్న సుభాషిణి, తన మిత్రుడి ఆదేశ్ తో వీడియో కాల్లో మాట్లాడిన తర్వాత ఈ దారుణానికి పాల్పడింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నాల్గవ పట్టణ సీఐ మధుసూదన్ గౌడ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.