కర్నూలు ప్రభుత్వాసుపత్రిని కర్నూలు ఎంపీ బస్తిపాటి పంచాలింగల నాగరాజు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎంపీ నాగరాజు మాట్లాడారు. ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధికి తాను నిరంతరం కృషి చేస్తానన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి అనేక నిధులను కేటాయించారని గుర్తు చేశారు. అనంతరం రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ప్రభుత్వ ఆసుపత్రికి సీఎం కృషి చేస్తారని హామీ ఇచ్చారు.