ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా, ఎస్పీ విక్రాంత్ పాటిల్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆధికారులతో కలిసి రైతుబజార్, ప్రజావేదిక, పార్క్లను పరిశీలించారు. శుభ్రత, బందోబస్తు, పార్కింగ్ తదితర ఏర్పాట్లపై సూచనలు ఇచ్చారు. ఓర్వకల్లు ఎయిర్పోర్ట్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.