కర్నూలు నగర ట్రాఫిక్ నియంత్రణకు వీధి వ్యాపారులు సహకరించాలని కమిషనర్ రవీంద్రబాబు పిలుపునిచ్చారు. శుక్రవారం టౌన్ వెండింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వ్యాపారులకు ఐడీ కార్డులు, వెండింగ్ సర్టిఫికెట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. వెంకటరమణ కాలనీ, సి. క్యాంపు, బిర్లా కాంపౌండ్ ప్రాంతాల్లో స్మార్ట్ స్ట్రీట్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ నెల 12న రీసర్వే ప్రారంభం కానుందన్నారు.