రాష్ట్రస్థాయి కనకదాసు జయంతిని కర్నూలులో నిర్వహించాలని జాతీయ సంగోళ్లి రాయన్న సేన ప్రధాన కార్యదర్శి బత్తిన కిరణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి మురళీమోహన్ లు డిమాండ్ చేశారు. శనివారం కర్నూలు జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా, బీసీ వెల్ఫేర్ అధికారిణి వెంకట లక్ష్మమ్మకు వినతిపత్రం అందజేసి, మాట్లాడారు. రాష్ట్రస్థాయిలో కార్యక్రమాన్ని కర్నూలులో నిర్వహించి, అన్ని ప్రభుత్వ సంస్థల్లో కనకదాసు జయంతిని జరిపించాలన్నారు.