కర్నూలులో అమానుషం ఘటన పది మందిపై కేసు

51చూసినవారు
కర్నూలులో అమానుషం ఘటన పది మందిపై కేసు
కర్నూలు జిల్లాలో కుమారుడు కులాంతర వివాహం చేసుకున్నాడని దళిత మహిళను కట్టేసి కొట్టిన ఘటన చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనలో సుమారు 10 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలు గోవిందమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మంజునాథ రెడ్డి శనివారం తెలిపారు. దాడిలో గాయపడిన గోవిందమ్మ ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

సంబంధిత పోస్ట్