మాధవరం సమీపంలోని ఇస్పాట్ స్టీల్ ఫ్యాక్టరీ నుంచి వస్తున్న బూడిద వల్ల పంటలు పండక నష్టపోతున్నామని మాధవరం, రచ్చమరి గ్రామ రైతులు కలెక్టర్ రంజిత్ భాష, ఇన్చార్జి మంత్రి రామానాయుడుకు గతంలో ఫిర్యాదు చేయడంతో గురువారం పొల్యూషన్ శాఖ అధికారులు కిషోర్ రెడ్డి, ఏఈ రామకృష్ణ ఫ్యాక్టరీ వద్ద విచారణ చేపట్టారు. రైతుల పంట పొలాలు పరిశీలించారు. ప్రస్తుతం పంటలు లేనందున వర్షాకాలంలో మళ్లీ పరిశీలన చేస్తామని హామీ ఇచ్చారు.