ఆదోని మండలంలో బైచిగిరి క్రాస్ నుంచి కపటి మీదుగా పెద్దకడబూరు వరకు గుంతలతో ప్రమాదకరంగా మారిన ఆర్అండ్బీ రోడ్డును వెంటనే మరమ్మతులు చేయాలని కోరుతూ ఆదివారం సీపీఎం ఆధ్వర్యంలో కపటిలో ప్రజలు నిరసన చేపట్టారు. కూటమి ప్రభుత్వం పట్టించుకోవడంలేదని రోడ్డు మరమ్మతులపై ప్రభుత్వం దృష్టి పెట్టకపోతే, రోడ్డు దిగ్బంధం కార్యక్రమం చేపట్టాల్సి వస్తుందని మండల కార్యదర్శి లింగన్న హెచ్చరించారు.