మంత్రాలయం: అప్పుల భారం తాళలేక రైతు మృతి

67చూసినవారు
మంత్రాలయం: అప్పుల భారం తాళలేక రైతు మృతి
అప్పుల భారంతో మంత్రాలయం మండలం సూగూరు గ్రామానికి చెందిన రైతు కురువ పెద్దయ్య (65) బుధవారం పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పంటల నుండి ఆదాయం రాక అప్పులు బారిన పడటంతో ఈ క్రమంలో తీవ్ర మనోవేదనకు గురైన ఆయన ఆత్మహత్యయత్నంకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు. రూ. 15 లక్షల అప్పులున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్