మంత్రాలయం: చిలకలడోనలో నిల్వ చేసిన గడ్డివాము దగ్ధం

68చూసినవారు
మంత్రాలయం: చిలకలడోనలో నిల్వ చేసిన గడ్డివాము దగ్ధం
మంత్రాలయం మండలంలోని చిలకలడోన గ్రామంలో శనివారం గడ్డివాము దగ్ధమైంది. మాజీ ఎంపీటీసీ డీపీ గోవిందమ్మ, రాఘవేంద్ర గ్రామ శివారులో పశుగ్రాసం నిల్వ చేసిన గడ్డివాములో మంటలు అంటుకున్నాయి. గ్రామస్తులు అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చి, నీటిట్యాంకర్లు, జేసీబీ యంత్రాలతో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ పశుగ్రాసం పూర్తిగా కాలిపోయింది. సుమారు రూ. 1. 5 లక్షల నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు.

సంబంధిత పోస్ట్