మంత్రాలయం మండల కేంద్రంలోని రాఘవేంద్రపురంలో 2017లో రూ.25 లక్షల వ్యయంతో నిర్మించిన ఓహెచ్ఆర్ ట్యాంకు ఇటీవల కుప్పకూలిన ఘటనపై శుక్రవారం ఆర్డబ్ల్యూఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ హరిరామ్ నాయక్, నిపుణులు సత్యనారాయణ పరిశీలించారు. నాణ్యత లోపం ఉన్నట్లుగా తేలితే కాంట్రాక్టర్ యువరాజ్ నుంచి వ్యయం రికవరీ చేస్తామని తెలిపారు. పరిశీలనకు ఈఈ పద్మజ, డీఈఈ మొయినుద్దీన్, ఏఈ వెంకట్రాముడు, సర్పంచ్ భీమయ్య హాజరయ్యారు.