కౌతాళం మండలానికి చెందిన
వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో నేడు గురువారం సమావేశం నిర్వహించనున్నట్లు
వైసీపీ మండల కన్వీనర్ ప్రహ్లాదాచారి తెలిపారు. సాయంత్రం 3 గంటలకు కౌతాళం గ్రామంలోని వైసీసీ కార్యాలయంలో సమావేశం ఉంటుందని చెప్పారు. సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి హాజరవుతారన్నారు. జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు హాజరు కావాలని కోరారు.