మంత్రాలయం టిడిపి ఇంచార్జి ఎన్. రాఘవేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ప్రజా వేదిక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రజలు ఆధార్, భూ, గృహ, అనారోగ్య సమస్యలతో పాటు, ముస్లింలు మైనారిటీ విద్యార్థుల కోసం ప్రత్యేక ఉర్దూ స్కూల్ ఏర్పాటు చేయాలని వినతులు అందజేశారు. జిల్లా, మండల, గ్రామస్థాయి అధికారులకు సమస్యలు త్వరగా పరిష్కరించాలని టిడిపి ఇంచార్జి రాఘవేంద్ర రెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు.